Thursday, September 7, 2017

సీత హనుమంతునితో రామునికి ఏమిచెప్పమన్నది?


సీత హనుమంతునితో రామునికి ఏమిచెప్పమన్నది?




సాహితీమిత్రులారా!


శ్రీమద్రామాయణంలో హనుమంతుడు సీతను
సందర్శించిన సమయంలో హనుమంతునితో
సీత ఈ శ్లోకం చెప్పింది-

మత్కృతే కాకమాత్రే తు
బ్రహ్మాస్త్రం సముదీరితం
కస్మా ద్యో మాం హరేత్ తత్త్వః
క్షమసే త్వం మహీపతే
(నా కోసం కాకిమీదనే బ్రహ్మాస్త్రాన్ని వేసిన నీవు
నీ నుండి నన్ను హరించినవాడిని(రావణున్ని)
ఎందుకు వూరుకున్నవు మహానుభావా! ఓ రామచంద్రా!)

సీత రామునికి నమ్మకంకోసం అంతవరకూ తనకూ రామునకూ
తప్ప మరెవరికీ తెలియని కాకాసుర వృత్తాంతాన్ని గుర్తు చేయవలసిందిగా
హనుమంతునికి చెప్పింది సీతాదేవి.

ఎంత భావగర్భితమైన విషయమోకదా


No comments:

Post a Comment