Saturday, June 17, 2017

మురుపు


మురుపు




సాహితీమిత్రులారా!


తుమ్మూరి రామ్మోహన్ రావుగారి
ఈ కవితను చూడండి-
సమకాలీన సమాజాన్ని
ఎలా ప్రతిబింబిస్తున్నదో

భాషల్ని ప్రేమిస్తున్నాం
వేదాల్ని వెక్కిరించే వెబ్సైట్లతో
భేదాల్ని ప్రబోధిస్తున్నాం
చేర్చుకుంటూ వస్తున్న చెలిమి గొలుసుల్ని
విద్వేషాల కొలిమిలో విడదీసుకుంటున్నాం
నదులనుండి ఎదిగిన నాగరికతను
నగశిఖరం ఎక్కించి అగాధంలోకి తోస్తున్నాం
అప్పుడు అజ్ఞానంలో ఆకులు కప్పుకున్నాం సరే
ఇప్పుడు విచ్చుకున్న విజ్ఞానంలో గుడ్డలిప్పుకుటున్నాం
గుహలనుండి గ్రహాలకు చేరినా
ఆగ్రహాగ్నుల అరణులమవుతున్నాం
మానవత్వం మాట మరచి
మనుజులమని మురిసిపోతున్నాం


No comments:

Post a Comment