Wednesday, July 28, 2021

ఇంతమాత్రానికే ఇంత గర్వం అవసరమా!

ఇంతమాత్రానికే ఇంత గర్వం అవసరమా! 




సాహితీమిత్రులారా!



రాజమందిరంలో నిరాటాకంగా తిరిగే రాజసేవకులు 

అదే తమపాలిటికి గొప్పగా భావించి గర్వించి 

రాజదర్శనానికొచ్చే పండితులను చూచి చూడనట్టుగా

వ్యవహరిస్తూ కసరుకొంటూ విర్రవీగితిరిగే వారిపై

ఒక కవిగారు పిల్లిపై పెట్టి ఈ విధంగా ఒక శ్లోకం చెప్పారు 

గమనింపగలరు-

మా గర్వ ముద్వహ బిడాల! మహీపతీనా

మంతఃపురం మణిమయం సదనం మమేతి

పట్టాభిషేకసమయే పృథివీపతీనాం

బాహ్య ట్థితస్య కలభస్య హి మండనశ్రీః!


ఓసీ పిల్లీ! నీవు మణిమయమైన రాజాంతఃపురంలో తిరుగుతున్నావని

ఇదే నా స్వంతిల్లని గర్వపడకురాజులకు పట్టాభిషేక మహోత్సవం జరిగే 

సమయంలో వెలుపలున్నగున్నయేనుగుకే అలంకార వైభవం కాబట్టి 

అలాంటి శుభసమయాల్లో నీమొగం చూచేవాళ్ళేవుండరు. పైగా 

నిన్ను చూస్తే అపశకునంగా భావిస్తారు. ఇంతమాత్రానికే 

ఇంత గర్వం అవసరమా - అని భావం

No comments:

Post a Comment