Saturday, July 24, 2021

మమ్మల్నంటే మేమనమా

 మమ్మల్నంటే మేమనమా




సాహితీమిత్రులారా!



ఈ శ్లోకం చూడండి-
ఎంత చిత్రంగా ఉందో

రామకృష్ణపరమహంస, రమణమహర్షి లాంటివాళ్ళు
మొదట ప్రపంచానికి అర్థంకాక పిచ్చివాళ్లనుకుంది.
కానీ వారు ప్రపంచాన్నీ అలాగే అనుకున్నారు.
అలాంటి విషయం వివరించే శ్లోకమే ఇది చూడండి-

జ్ఞాత తత్త్వస్య లోకోయం జడోన్మత పిశాచివత్
జ్ఞాత తత్త్వోపి లోకస్య జడోన్మత్త పిశాచివత్

మిథ్యా ప్రపంచాన్ని అర్థం చేసుకొన్న జ్ఞానికి
లోకం వెఱ్ఱివాళ్ళమయమని అనిపిస్తే
మరి మొదటినుండి తత్త్వజ్ఞానులున్ని
అందరినీ వెఱ్ఱివాళ్ళకిందే జమకట్టింది
ఈ మాయాలోకం- అని భావం

అంతే కదా మరి
మమ్మల్ని వెర్రివాళ్లంటే
మేమనమా


No comments:

Post a Comment