Tuesday, November 24, 2020

మద్దుపల్లి సుబ్రహ్మణ్యంగారి చమత్కారం

 మద్దుపల్లి సుబ్రహ్మణ్యంగారి చమత్కారం





సాహితీమిత్రులారా!



మద్దుపల్లి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు

1959-60 సంవత్సరమునందు కర్నూలు

సెంట్ జోసెఫ్స్ గరల్స్ హైస్కూలులో

ప్రధానాంధ్ర పండితుడుగా పనిచేయు సమయంలో

అక్కడి ఉపాధ్యాయులుగా ఉన్న సిస్టర్స్ అక్కడి క్రమశిక్షణ

గురించి చెబుతూ ఇక్కడ ఆకుకూడ కదలదని చెప్పిరట.

దానికిగాను ఆయన చమత్కరించిన ఈ శ్లోకం చూడండి-

పత్రం వాపి ప్రచలతి న వై బాలికా పాఠశాలా
స్వేవం శిక్షాక్రమ ఇతిపదే దేవమే వాస్తుఃకింతు
మద్భావోయంన చలతి మరుత్త్వత్రభిత్యేతి యస్మా
ద్వేణి బంధైర్విషధరనిభైరత్ర కాంతాశ్చరన్తి


క్కడ ఆకులు కదలక పోవటానికి
కారణం ఇక్కడి క్రమశిక్షణకాదు

మద్భావోయం - నా అభిప్రాయమేమనగా
నచలతి మరుత్త్వత్ర భీత్యేతి-
ఇక్కడ గాలి సంచరించటంలేదు
కాన ఆకులు కదలటంలేదు
గాలి సంచరించలేదనగా
భీత్యా - భయంచేత,
గాలి ఎందుకు భయపడవలసిన పని
ఏమంటే విషధర నిభై - పాముల వంటి
వేణిబంధైః - జడలతో
అత్ర కాన్తాశ్చరన్తి- ఇక్కడ యువతులు పెక్కు
మంది తిరుగుతున్నారు కనుక
పాములు వాతాశనములు(గాలిని భుజించేవి)గనుక
తన్నెక్కడ మ్రింగిపోతాయో అని భయపడి గాలి
ఈ ప్రక్కకు రాకుండా పోయింది.
అందుచే ఆకు కదలాడకున్నది.

No comments:

Post a Comment