Wednesday, November 18, 2020

ఆమె ఎంత గయ్యాళో!

 ఆమె ఎంత గయ్యాళో!



సాహితీమిత్రులారా!

విశ్వనాథ సత్యనారాయణగారు

తన విశ్వనాథ పంచశతిలో

కూర్చిన పద్యం చూడండి -

ఇందులోని చమత్కారమేమో

గమనించండి-

ఊరిభార్య లెల్ల రూహించి యామె మం

చంబుతో నిడిరి శ్మశానమందు

నట పిశాచకాంత లాలోచనము చేసి

పడతి మరల నూరి నడుమ నిడిరి

                                                      (విశ్వనాథ పంచశతి)

ఇందులో ఒక మహాతల్లి ఎంత గయ్యాళో

కవి చెప్పదలుచుకొన్నాడు కానీ ఆమె గయ్యాళి

అని ఒక్కమాటైనా అనకుండానే ఎలా చెప్పాడో

చూడండి-

ఊళ్ళో ఉన్న భార్యలంతా సమావేశం జరిపి

ఈ గయ్యాళిని విదిలించేందుకు ఇదే సరైన మార్గమని

రాత్రివేళ ఆమెను మంచంతో కూడ మోసుకొని పోయి

శ్మశానంలో ఉంచి వచ్చారు. ఆ శ్మశానంలోని పిశాచకాంతలు

తెల్లవారే సరికి ఆమెను పీక్కుతింటాని ఊరివారంతా సంతోషించారు.

పాపం వాళ్ళకోరిక నెరవేరలేదు. శ్మశానంలోని పిశాచకాంతలంతా

ఆలోచించి తెల్లవారేలోగా ఆమెను మంచంతో సహా మోసుకొని వచ్చి

ఊళ్ళో దించి వెళ్ళారట.


దీన్ని బట్టి ఆమె ఎంత గయ్యాళో

చెప్పక్కరలేదుకదా!

ఎంత చమత్కరించారో కదా!

No comments:

Post a Comment