Monday, January 13, 2020

మెరుపులు(గురజాడ వారి పద్యాలు)


మెరుపులు(గురజాడ వారి పద్యాలు)




సాహితీమిత్రులారా!
Image result for gurajada venkata apparao

గేయాలు కవితలు నాటికలు మాత్రమే 
మన నవయుగవైతాళికుడు గురజాడ వేంకట అప్పారావు
వ్రాశారని చాలమంది అనుకోవడం జరుగుతున్నది. 
ఆయన పద్యాలు కూడా వ్రాశాడని 
ఈ పద్యఖండిక ద్వారా తెలుస్తుంది. గమనించండి-

ఈవియు దియ్యనిమాటయు
భావంబున జేయతగిన పని తెలియుటయున్
ఠీవియగు ధైర్యభావము 
రావుసుమీ యొకనివలన రావలె తనతోన్

మానిసులు గాని యింతుల
తా నేర్చని నేర్పు చెలగుతరి జెప్పంగా
జ్ఞానవతుల కగునెె పికము
దాని శిశువుల బెంచు నెగురుదాక నొరుచేన్

గడ్డితిను కారు మెకముల
బొడ్డున కస్తూరి నునిచి పొలియగజేసెన్
జడ్జివిధి దుష్టజిహ్వల 
నొడ్డిన సమకూరు శుభము లుర్విజనులకున్

అడచుకొన కింద్రియంబుల 
నిడుమల కది త్రోవ యండ్రు యివి యడచుటయే
కడుసంపదలకు బాటగు 
నడుమే తేర వి ష్టమొదవు నామార్గమునన్

కాశి జచ్చెనేని కలుగదు జన్మంబు
కలిగెనేని కలుగు నుదుట కన్ను
సిరసు నందు చిన్ని సిరి తోబుట్టువు
కంఠసీమ వెలయు గరళ చిహ్న

నాల్గు రీతుల గనకంబు నాడెమగును
వేటు గీటుల తునియించి వెచ్చజేసి
నరుడు నట్టుల నాల్గింట నాడెమగును
కులము శీలంబు కర్మంబు గుణముచేత

(ఇవి సంస్కృత శ్లోకాలకు అనువాదాలుగా 
అవసరాల సూర్యారావు గారు గుర్తించారు.)
అనువాదమైనా కాకపోయినా పద్యాలు పద్యాలు చక్కగా కూర్చారుకదా!

No comments:

Post a Comment