Monday, December 23, 2019

తల్లి! నీసాటి దాతలీ ధరణి గలరె


తల్లి!  నీసాటి దాతలీ ధరణి గలరె




సాహితీమిత్రులారా!

మనం అన్నదానంలో డొక్కాసీతమ్మ తరువాతే మిగిలినవారిని గురించి చెప్పుకోవాలి ఈమె బ్రాహ్మణకులంలో, వ్యవసాయ వృత్తి ఆధారంగా జీవించే కుటుంబంలో 1841లో జన్మించారు. ఈమె భర్త డొక్కా వెంకట జోగన్నగారు. ఈయన దయాహృదయుడు, అన్నదాత. వీరి సహకారంతోనే  సీతమ్మ మహాదాతకాగలిగారు. ఈమె 68 సంవత్సరాలు
జీవించి అన్నార్తులకు ఆశాదీపంగా వెలుగొందారు. ఈమె 1909 ఏప్రిల్ 28న స్వర్గస్థులయ్యారు. ఈమన గురించి ఒక అజ్ఞాతకవి ఈ పద్యంతో ఆమెను కీర్తించారు. ఆపద్యం -

నిరతాన్న దానంబు, నిర్మలమగుమది, 
                             చేతి కడ్డిను లేక చేసినావు 
నీ నామధేయంబు, నీ గ్రామ నామంబు 
                            నిండియుండెనుగ భూమండలమున
యిదిగాక, నీనామ మింగ్లాండు వరకేగి
                            రారాజసభలోన రాణకెక్కె
నీ తల్లిదండ్రులు, నిరుపమ గుణశాలు 
                             రవుటచే, నీకింత ఖ్యాతిగల్గె
గన్నవరంబునఁ గీర్తిగాంచినావు 
తల్లి! నీసాటిదాతలీ ధరణి గలరె
యన్న దానంబు నీ వెన్క సన్నగిల్లె 
నతుల డొక్కా న్వయమణి సీతమ్మ తల్లి

ఈ పద్యం వల్ల సీతమ్మ దాతృత్వం, కీర్తి ప్రతిష్ఠలు
తేటతెల్లమవుతున్నాయి కాని ఆ కవి పేరు మనకు లభించలేదు.
ఇలాంటి వారు చరిత్రలో మిగులుతున్నారేకాని ఒక్కరైనా నేటి కాలంలో
కనిపించడంలేదుకదా

No comments:

Post a Comment