Saturday, April 22, 2017

దివిజకవివరు గుండియల్ దిగ్గురనగ


దివిజకవివరు గుండియల్ దిగ్గురనగ




సాహితీమిత్రులారా!



సాహితీజగత్తులో కవిసార్వభౌముడు
అనగానే శ్రీనాథుడని తెలియనివారుండరు
ఆయన జీవితం ఒక ఉదాహరణ ప్రతి మనిషికి
జీవితంలో ఎన్ని ఉత్తాన పతనాలున్నా చివరికి
ఆనందంగా జీవిత యాత్ర ముగిస్తే ఎంతో సంతోషదాయకం
ఆయన జీవితం అలాజరగలేదు మొదట
ఎంత విలాసవంతంగా భోగభాగ్యాలతో
ఉన్నాడో చివరికి అంత దారిద్య్రంతో విలవిలాడాడు
ఈ పద్యం అవసానదశలో ఆయనను సన్మానించినవారిని
జీవనాధారం కల్పించిన వారిని అనుకుంటూ నిర్వేదంతో
చెప్పినదినది కానీ ఇందులోనూ ఒక చమత్కారం ఉంది
అదేమిటంటే దివిజకవివరు గుండియల్ దిగ్గురనగ
అంటే దేవతల కవివరుడు బృహస్పతికి గుండె గుభేలుఅనేవిధంగా
తను అమరపురికి వెళుతున్నానంటూ ఆత్మాభిమానాన్ని చాటుకున్నాడు.

కాశికా విశ్వేశు గలిసె వీరభద్రారెడ్డి
       రత్నాంబరంబు లేరాయడిచ్చు
రంభగూడె దెనుంగు రాయరాహుత్తుండు
       కస్తూరికేరాజు ప్రస్తుతింతు
స్వర్గస్తుడయ్యె విస్సనమంత్రి, మరిహేమ
       పాత్రాన్న మెవ్వని పంక్తి గలదు
కైలాసగిరి బండె మైలారు విభుడేగి
       దినవెచ్చమేరాజు తీర్చగలడు
భాస్కరుడు మున్నె దేవుని పాలి కరిగె
కలియుగంబున నికనుండ కష్టమనుచు
దివిజకవివరు గుండియల్ దిగ్గురనగ
అరుగుచున్నాడు శ్రీనాథుడమరపురికి


వీరారెడ్డి అనే ప్రభువు రత్నాంబరాలు ఇచ్చేవాడు
అతడు ఇప్పుడు కాశికావిశ్వేశ్వరునిలో కలిసిపోయినాడు
అనగా దివంగతుడైనాడు. ఇక ఏరాజు ఇస్తాడవి.

తెనుగురాయడు స్వర్గం చేరి రంభతో కూడి ఉన్నాడు
ఇప్పుడు కస్తూరిఇమ్మని ఏరాజును ప్రార్థించాలి.

విస్సన్నమంత్రితో పంక్తిలో బంగారు పాత్రలో భోజనం చేసేవాణ్ణి
అతడుకూడ పరలోకం వెళ్ళాడు. ఇప్పుడు ఎవరితో భుజించాలి.

మైలారు విభుడు నాకు దినవెచ్చంగా ఆహారధాన్యాలు పంపేవాడు
ఆయనా కైలాసానిపోయి శయనించాడు ఇక ఇప్పుడెవరిస్తారు.

భాస్కరమంత్రి కూడ ముందే భగవంతుణ్ణి చేరుకున్నాడు
ఇక ఇటువంటి పరిస్థితులలో కలియుగంలో జీవించడం కష్టమనితలచి
స్వర్గలోకంలోని దేవతల కవి గుండెలు అదరగా శ్రీనాథుడు దేవలోకానికి
వెళుతున్నాడు- అని చెప్పుకున్నాడు శ్రీనాథుడు.


No comments:

Post a Comment