Sunday, June 7, 2020

కవిచమత్కారం


కవిచమత్కారం





సాహితీమిత్రులారా!

శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి ఒకమారు వేశ్య(కవయిత్రి) వచ్చి
అష్టదిగ్గజకవులకు సవాలుగా ఒక సమస్యను ఇచ్చింది.
"మీరును మీరు మీరు మఱి మీరును మీరును మీరలందఱున్" - అనేది సమస్య.
ఆ సమస్యను మరుసటి రోజుకు చెప్పేవిధంగా సమయమిచ్చింది.
దీనికి సమాధానం ఎలాగా అని ఆలోచించి తెనాలి రామకృష్ణుని ఆశ్రయించినారు.
దానికి అతడు పెద్దనతో 
"రేపు బోగంది వచ్చి సమస్య అడిగినంతలో మా శిష్యుడు 
అని మీరు చెప్పగా నేను మీ శిష్యుడనై చెబుతాను" -  అని అన్నాడు.
కచేరి ప్రారంభమైంది పెద్దన తన శిష్యుడు చెబుతాడని చెప్పాడు.
తెనాలిరామకృష్ణుడు లేచి పద్యాన్ని ఈ విధంగా పూరించాడు.

"కోరిక లుప్పతిల్ల మదిఁగోరిన యట్టి కళా విశేషముల్
 చారు తరంబులన్ రతుల సల్పఁగ నేర్చిన యట్టి జాణ యీ
 వార వధూ శిరోమణి వంతుల వేసుక దెబ్బ తీయుఁడీ
 మీరును మీరు మీరు మఱి మీరును మీరును మీరలంద
ఱున్"

దీనితో అష్టదిగ్గజ కవులు ఆనందించగా సభ అంతా
 కరతాళధ్వనులతో వెల్లివిరిసింది. 

No comments:

Post a Comment