Wednesday, April 18, 2018

విష్ణుపురాణం


విష్ణుపురాణం



సాహితీమిత్రులారా!



విష్ణుపురాణం అష్టాదశ పురాణాలలో మూడవది.
మైత్రేయుని అభ్యర్థనపై పరాశరుడు చెబుతున్నట్లుంది.
విష్ణుపారమ్యాన్ని ప్రతిపాదించే పురాణమని పేరే చెబుతున్నది.
ధ్రువుడు, వేనుడు, పృథుమహారాజు, యవనాశ్వుడు, మాంధాత 
మొదలైన వారి చరిత్రలు, శంబరాసుర వృత్తాంతము, నరకుని 
వృత్తాంతము మొదలైనవి దీనిలో వర్ణించబడినాయి. కృతయుగం 
మొదలు కలియుగం వరకు మానవుల ప్రవృత్తులు, జీవన విధానాలలో 
కలిగే మార్పులను యుగధర్మాలనే పేరుతో ఈ పురాణం సూచించింది. 
ప్రాసంగికంగా వచ్చిన వృత్తాంతాలలో క్షీరసాగర మథనం, ప్రహ్లాద చరిత్ర, 
వ్యాసుడు వేదవిభాగాలను చేయడం, అష్టాదశ పురాణాల అనుక్రమణిక, 
చతుర్దశ విద్యల విభజన, వైష్ణవ లక్షణాలు, వర్ణాశ్రమ ధర్మాలు, సగర,
శ్రీరామాది సూర్య వంశ రాజుల కథలు, తారాశశాంక పురూరవవాది 
చంద్రవంశ రాజుల కథలు, శ్యమంతకోపాఖ్యానం, శ్రీకృష్ణావతార కథ, 
ఖాండిక్య కేశిధ్వజ జనకసంవాదం మొదలైనవి చెప్పబడ్డాయి. 

విష్ణుపురాణానికి మొదటి తెలుగు అనువాదం 
పశుపతి నాగనాథునిది (14వ.శ.) ఇది అలభ్యం. 
తరువాత వెన్నె కంటి సూరన(16వ.శ.), కలిదిండి 
భావనారాయణ(16వ శ.), కళ్లేపల్లి నరసింహమూర్తి, 
తాడేపల్లి సీతారామస్వామి(19వ శ.) పద్యానువాదాలు చేశారు. 
తుపాకుల అనంతభూపాలుడు(18వ శ.), నోరి గురులింగశాస్త్రి(19వ శ.) 
వచన రచనానువాదం చేశారు.

No comments:

Post a Comment