Sunday, February 4, 2018

నిత్యానంద ఘోషు


నిత్యానంద ఘోషు




సాహితీమిత్రులారా!

మన తెలుగులో భారతాన్ని
నన్నయ తిక్కన ఎఱ్ఱన(కవిత్రయం)
సంస్కృతం నుండి అనువదించారు
అలాగే నిత్యానందఘోషు బాంగ్లలో
వ్యాసభారతాన్ని 18 పర్వాలుగా
రచించాడు. అయితే దీన్ని
విజయ పాండవ కథ అని పిలుస్తారు.

"విజయ పాండవ కథా అమృతలహరీ
సునిలె అధర్మఖండె పరలోకె తరి
సున సున అరె భాయి హయె ఏకమన
నిత్యానంద ఘోష బలె భారత కథన"
(విజయ పాండవ కథామృతలహరి వింటే అధర్మం
ఖండనదిమవుతుంది. పరలోకం లభిస్తుంది. వినండి
వినండి సోదరులారా ఏకాగ్రచిత్తంతో వినండి.
నిత్యానంద ఘోషు చెబుతున్నాడు.)

నిత్యానందఘోషు అశ్వమేధపర్వం మాత్రం
వ్యాసుని రచననే కాకుండా జైమిని రచనను
కూడ తీసుకొని అనువదించాడు. అతని రచన
సరళమైంది. ఆబాల వృద్ఝుల వరకు అవగతమౌతుంది.
కురుక్షేత్రం రణరంగంలో దుర్యోధనుడి
మృతదేహాన్ని చూచిన గాంధారి అన్న మాటలు చూడండి-

"దేఖ కృష్ణ! మరి ఆఛె రాజా దుర్యోధన,.
సంగేతె నాదెఖి కెన కర్ణదుశ్శాసన?
శకుని సంగెతె కెన నా దేఖి రాజన?
కథాభీష్మ మహాశయ, గాంధార నందన?
ఏకాదశ అక్షౌహినీ యార సంగె జాయ్,
హేన దుర్యోధన రాజా ధులాయ్ లుటాయ్,
సువర్ణేర ఖాటై జారీ సతత శయన,
ధూలాయ్ ధూపర తను హయ్యాఛె ఏఖన."
(చూడు కృష్ణ దుర్యోధనరాజు చచ్చి పడున్నాడు.
దగ్గర కర్ణ దుశ్శాసనులు కనబడరేమీ రాజరాజుతో శకుని లేడేమి
భీష్మమహాశయుడేడీ పదకొండు అక్షోహిణుల సేన వెంట
నడిచే మహారాజు ధూళిలో ఎలా పొర్లాడుతున్నాడో
బంగారు మంచంమీద ఎల్లప్పుడూ శయనించే రాజు ఇప్పుడు
ధూళిధూసర దేహంతో పడున్నాడు)

No comments:

Post a Comment