Saturday, February 24, 2018

అద్భుతరామాయణం - రఘునాథమహంత


అద్భుతరామాయణం - రఘునాథమహంత




సాహితీమిత్రులారా!




మన దేశంలోని ప్రతి భాషలోనూ
రామాయణం వ్రాయబడింది.
అందులోని కొన్ని రామాయణాలను
గురించి తెలుసుకునే మార్గంలో
మైథిలీ భాషలో వైద్యనాధ్ మాలిక్ కృత
సీతాయనం గురించి తెలుసుకున్నాము.
ఇప్పుడు అస్సామీకి చెందిన అద్భుత
రామాయణాన్ని గురించి తెలుసుకుందాం-

అద్భుతరామాయణాన్ని 18వ శతాబ్దిలోని 
రఘునాథమహంత రామాయణాన్ని మొదట
వచనకావ్యంగా వ్రాశాడు తరువాత అద్భుత
రామాయణాన్ని మార్కండేయ పురాణం
నుండి వస్తువును తీసుకొని వ్రాశానని
చెప్పుకున్నాడు. ఇందులోని కథ-

శ్రీరాముడు తనపట్ల చేసిన ఆరోపణకు క్రుంగిపోయిన సీతాదేవి
తల్లియైన భూదేవి ఒడిలో చేరి పాతాళలోకం చేరుకుంటుంది.
కుమారులైన లవకుశుల వియోగాన్ని సహించలేక ఏ ఉపాయంతో
నైనా వారిని తన వద్దకు తీసుకురమ్మని వాసుకుని కోరుతుంది.
హనుమదాదుల రక్షణవలయాన్ని ఛేదించి తీసుకురాలేక వాసుకి 
బ్రాహ్మణ రూపంలో శ్రీరాముని వద్దకు వెళ్ళి విద్యనేర్పే మిషతో
లవకుశులను పాతాళానికి తీసుకువస్తాడు.  కాని సీతాదేవి భర్తతో
కలిసి ఉండే యోగం తనకు లేదని, శ్రీరామునికి, లవకుశులకు,
హనుమంతునికి మాత్రమే కనబడే విధంగా అదృశ్యరూపంలో వచ్చి
ప్రతిదినం ఒకసారి దర్శనమివ్వగలనని చెప్పి అదృశ్యమౌతుంది.
ఇది అద్భుత రామాయణ కథ.

దీనితో పాటు రఘునాథమహంత శత్రుంజయ 
కావ్యాన్ని కూడ వ్రాశారు. విచిత్ర కథలతో
వాలి, హనుమంతుల శౌర్య సాహసాల గాథలను 
వివరించే కావ్యంగా శత్రుంజయ కావ్యం కూర్చారు.
జైన సాంప్రదాయంలోని రామాయణకథలను,
పామరజనుల నోటికథలను తెలిసి ఉండి, 
అవి అంతరించి పోకుండా ఈ గ్రంథాల్లో 
పదిలం చేశాడని ఒకభావన.

No comments:

Post a Comment