Friday, February 2, 2018

సుశీలమ దెవ్వనియందు శోభిలున్


సుశీలమ దెవ్వనియందు శోభిలున్




సాహితీమిత్రులారా!


ఈ పద్యం చూడండి-
జనసమ్మతమైన సుశీలము ఎవరియందు ఉంటుందో
వానికి ఏవి సాధ్యమౌతాయో కవి వివరిస్తున్నాడు.
ఇది ఏనుగు లక్ష్మణకవి కృత భర్తృహరి నీతిశతకంలోనిది.

అతనికి వార్ధి కుల్య, నగ్ని జలం బగు, మేరుశైల మం 
చితశిలలీల నుండు, మదసింహము జింక తెఱంగుఁ దాల్చుఁ, గో
పితఫణి పూలదండ యగు, భీష్మవిషంబు సుధారసం బగున్
క్షితి జనసమ్మతంబగు సుశీల మదెవ్వనియందు శోభిలున్

ఎవనిలో మంచి స్వభావం శోభిస్తూ ఉంటుందో
వానికి సముద్రం ఒక చిన్న కాలువలాగా,
నిప్పు నీటిలాగా, మేరుపర్వతం చిన్న రాయిలాగా,
మదించిన సింహం లేడిలాగా, కోపించిన సర్పం
పూలదండలాగా, భయంకరమైన విషం అమృతంలాగా
ఔతాయి - అని భావం.

No comments:

Post a Comment