Friday, February 16, 2018

వచనం వికాస ప్రారంభం


వచనం వికాస ప్రారంభం




సాహితీమిత్రులారా!




వచనం దానివికాసం గురించి అది ప్రారంభంలో
ఎలా ఉన్నది తెలిపే ప్రయత్నం-
తెలుగులో మొదట అచ్చైన పుస్తకం 1746లో
అదీ నూరు జ్ఞానవచనాలు దీన్ని రెవరెండ్ బెంజిమన్
షుల్జ్ ముద్రించాడు. దీనితో తెలుగు ముద్రణా యుగం 
ప్రారంభమైంది. ఇది వచన పుస్తకం. అంటే తెలుగులో 
మొదట ముద్రించబడిన పుస్తకం వచనంలోనే. 
పాశ్చాత్యులు తమ మతప్రచారంకోసం మొదలు పెట్టిన
ముద్రణ మన సాహిత్యానికి ఎంతో మేలు చేసిందనవచ్చు.
అదీనూ వచనానికి. దీనితో మరీ అభివృద్ధి చెందింది.
తెలుగురాని తెలుగేతరులకోసం వ్యాకరణ పుస్తకాలను 
1814లో డా. క్యారీ దొరగారు ముద్రించారు. అలాగే
1816లో ఏ.డి.కాంబెల్, 1817లో సి.పి.బ్రౌన్ తెలుగు 
వ్యాకరణాలను ముద్రించారు. ఇవన్నా వచనంలోనివే.
          1912లో ఫోర్ట్ సెంటు జార్జి కళాశాలను స్థాపించి
తెలుగు వచనబోధనకు పుస్తకాలు లేనందున ఆ కళాశాలలో 
ప్రధానాధ్యాపకులుగా ఉన్న రావిపాటి గురుమూర్తి శాస్త్రి
1819లో ద్వాత్రింశత్సాలభంజికల కథలు (విక్రమాదిత్యుని కథలు)
1834లో పంచతంత్రకథలు, 1836లో వ్యాకరణ పుస్తకాలను
చక్కని వ్యావహారిక భాషలో వ్రాయబడి అనేకమార్లు 
ముద్రింపబడినాయి.
తరువాత 
పాటూరి రామస్వామి - శుకసప్తతికథలు(1840)
పాటూరి నరసింహశాస్త్రి - హరిశ్చంద్రునికథ(1840)
పాటూరి రంగశాస్త్రులు - చేమకూరవారి విజయవిలాసము(1841)
టి.రాఘవాచార్యులు - నలచరిత్ర(1841)
ధూర్జటి లక్ష్మీపతి - హంసవింశతి(1842)
దిలారామకథలు, భూగోళదీపికలు(1843)
భేతాళ పంచవింశతి (1848)
ఈ విధంగా వచనంలో అదీను వ్యాహారిక భాషలో
1855 వరకు అచ్చులో రావడం మొదలుపెట్టాయి.

No comments:

Post a Comment