Friday, January 26, 2018

శ్రీమహావిష్ణువుకు వింజామరలు వీచేవారు


శ్రీమహావిష్ణువుకు వింజామరలు వీచేవారు




సాహితీమిత్రులారా!



వద్దిపర్తి కోనంరాజుకవి కృత
మహాలక్ష్మీ పరిణయములో
అష్టశక్తులను వివరించారు
ఆ అష్టశక్తులు శ్రీమహావిష్ణువునకు
వింజామరులు వీచేవారట-
ఆ పద్యం చూడండి-

సరసిజాలయ సావిత్రి సర్వభద్ర
విమల పద్మ మహాదేవి విలసదీశ
జాహ్నవి యనంగ నెనమండ్రు శక్తులెపుడుఁ
జామరంబుల వీతురు చక్రిమ్రోల
                                    (మహాలక్ష్మీ పరిణయము - 1-25)

శ్రీమహావిష్ణువు సన్నిధిలో వింజామరలు వీచే
ఎనిమిదిమంది ఎనిమిది శక్తులు వారి పేర్లు-
1. సరసిజాలయ, 2. సావిత్రి, 3. సర్వభద్ర,
4. విమల, 5. పద్మ, 6. మహాదేవి,
7. ఈశి, 8. జాహ్నవి.

No comments:

Post a Comment