Sunday, October 8, 2017

శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 7


శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 7




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........



96. గుఱ్ఱాన్ని వెదకడానికి వెళ్ళిన వారెవరు?
     - 60వేల మంది సగరపుత్రులు

97. 60వేలమంది సగరపుత్రులు ఎవరి ఆగ్రహానికి బలైనారు?
     - కపిల మహర్షి తపశ్శక్తి ఆహుతైపోయారు

98. అరవైవేల మందికి ఉత్తమగతులు కలగాలంటే దేవలోకపు 
      గంగను తీసుకురావాలని చెప్పింది ఎవరు?
      - గరుత్మంతుడు

99. యాగాశ్వాన్ని కపిలుని వద్ద నుండి తెచ్చింది ఎవరు?
      - అంశుమంతుడు

100. దివిజగంగను భువికి తేవడానికై ప్రయత్నించినవారు?
       - సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు

101. దేవగంగను భువికి తెచ్చినవాడు?
       - భగీరథుడు

102. భగీరథుడు గంగకై మొదట ఎవరిని గురించి తపస్సు చేశాడు?
      - బ్రహ్మదేవుని గూర్చి

103. భగీరథునికి శంకరుని ప్రార్థించమని చెప్పింది ఎవరు?
      - బ్రహ్మదేవుడు

104. శివుని జటాజూటం నుండి బిందు సరేవరంలోకి చేరిన గంగ
         7 పాయలుగా ఏ పేర్లతో ప్రహించినది?
        - హ్రాదిని, నలినీ, పావనీ(ఈ 3 తూర్పునకు),
           సుచక్షు, సీత, సింధు (ఈ 3 పడమరకు)
          భాగీరథి(భగీరథుని వెంట) ప్రవహించాయి.

105. పాతాళానికి చేరిన  దేవలోకంలోను, భూలోకంలోనూ,
         పాతాళలోకంలోనూ ప్రవహించే ఈ గంగను పిలిచే పేరు?
         - త్రిపథగ

No comments:

Post a Comment