Tuesday, November 15, 2016

ఎండ నన దిఙ్ముఖములు రాఁజె


ఎండ నన దిఙ్ముఖములు రాఁజె




సాహితీమిత్రులారా!



శ్రీకృష్ణదేవరాయలవారు తన ఆముక్తమాల్యదలో 
ద్వితీయాశ్వాసంలో 48 పద్యం నుండి 70వ పద్యం 
వరకు మొత్తం 22 పద్యాలు వేసవి కాలవర్ణ తో సాగింగాయి. 
అందులోని ఒక పద్యం చూడండి-


నీర్ఝర ప్రబలవేణిక లింక జట్రాలఁ
         బేరినప్రాచి పెన్పేటు లెగసె
నెఱుకులు పడియనీ రివుర  గువ్వలఁ బట్టఁ
         బోయునీ రాడడఁ బొలము నెఱసె
సురగాలి దవదగ్ధ తరుపర్ణతతి రేఁపఁ
         బావురా లని డేగపదుపు దూఱె
నిద్రితద్రుచ్ఛాయ నిలువక జరగ వెం
         బడిన యధ్వగ పంక్తి పొరలువెట్టె
క్షేత్రపాలున కుదికినచీర లాఱు
చాకిరేవులగములయ్యె సకలదిషలుఁ
దెలుపులుగఁ దోఁచె నెండమావుల బయళ్ళు
గందె నివి యెండ నన దిఙ్ముఖములు రాఁజె
                                                                                                      (2-46)


నీర్ఝర ప్రబలవేణిక లింక జట్రాలఁ
         బేరినప్రాచి పెన్పేటు లెగసె

కొండలపైనుండి దూకే సెయేళ్ళపాయలు ఎండిపోగా
వాటి మధ్యలో ఉన్న చట్టుబండలపై నీరు ఉన్నపుడు
పేరుకొని పోయిన పాకుడు(ప్రాచి) బిళ్ళలు బిళ్ళలుగా
పగిలిపోయింది.

నెఱుకులు పడియనీ రివుర  గువ్వలఁ బట్టఁ
         బోయునీ రాడడఁ బొలము నెఱసె
అడవిలో పల్వల సమూహాల్లోని నీరు (చిన్న గుంటలలోని నీరు)
ఆవిరై పోయాయి.(ఎరుకల వాళ్ళు గువ్వల కోసం అక్కడక్కడా
గుంటలు త్రవ్వి నీరు పోసి ఉంచుతారు గువ్వలు అక్కడ
వాలినపుడు పట్టుకోవడానికి అనుకూలంగా) ఆగుంటల్లోని
నీరు పొలాలలో అక్కడక్కడా కనిపిస్తున్నాయి కాని చెరువుల్లోను
గుంటల్లోను నీరు ఎక్కడా ఒక్కబొట్టుకూడ లేదు.


సురగాలి దవదగ్ధ తరుపర్ణతతి రేఁపఁ
         బావురా లని డేగపదుపు దూఱె
కార్చిచ్చులో పడి చెట్లు కాలిపోగా కాలిన అస్థిపంజరాల్లా
ఆకులు సుడిగాలిలో అల్లాడుతున్నాయి. వాటిని చూచి గద్దలు
పావురాలనుకొని ఆ మాడిన ఆకుల గుంపుల్లోకి ప్రవేసిస్తున్నాయి.

నిద్రితద్రుచ్ఛాయ నిలువక జరగ వెం
         బడిన యధ్వగ పంక్తి పొరలువెట్టె
చెట్లనీడల్లో మధ్యాహ్నవేళ ప్రయాణం చేస్తూ అలసిపోయిన
బాటసారులు ప్రక్కనే ఉన్న బావులలో ఇంతనీరు త్రాగి
సేదతీరి నిద్రపోయారు. ఆ నీడలు సూర్యగమనంతో
చలిస్తూంటే నిద్రలో ఉన్న బాటసారులు తెలియకుండానే
నీడతోపాటు దొర్లుతున్నారు.


క్షేత్రపాలున కుదికినచీర లాఱు
చాకిరేవులగములయ్యె సకలదిషలుఁ
దెలుపులుగఁ దోఁచె నెండమావుల బయళ్ళు

అన్ని దిక్కులు తెల్లగా మెరిసిపోతున్నందున
అవి క్షేత్రపాలకుడు(కాలభైరవుడు) ఉతికి ఆరవేసిన
వస్త్రాల్లా ఉన్నాయి


గందె నివి యెండ నన దిఙ్ముఖములు రాఁజె

సుకుమారువ ముఖాలు ఎండలో కంది పోవడం
సహజం కనుక దిక్కులనబడే స్త్రీలముఖాలు
కందిపోయినవో అన్నట్లుగా రాజుకున్నాయి
దిగంతాలలో కార్చిచ్చు క్రమ్ముకొన్నది.

రాయలసీమలో ఎండలు ఎంతగా ఉంటాయో
దీనిలో వర్ణించిన సహజరీతి తెలుపుతున్నది

No comments:

Post a Comment