Friday, November 25, 2016

పునుగుందావి నౌదనంబు మిరియంపు బొళ్లతో


పునుగుందావి నౌదనంబు మిరియంపు బొళ్లతో




సాహితీమిత్రులారా!


శీతాకాలంలో విష్ణుచిత్తుడు అతిథులకు
ఎలాంటి భోజనం వడ్డిచేవాడో
శ్రీకృష్ణదేవరాయలు
ఆముక్తమాల్యదలో ఇలావివరించాడు-

పునుగుదావి నౌదనంబు మిరియంపు బొళ్లతో జట్టి చు
య్యను నాదాఱని కూరగుంపు, ముకుమందై యేర్చునావం జిగు
ర్కొను పచ్చళ్లును, బాయసాన్నములు, నూరుంగాయలున్, జేసుఱు
క్కను నేయుం, జిఱుపాలు వెల్లువగ నాహారంబిడు న్సీతునన్
                                                                             (ఆముక్తమాల్యద-1-82)

పుగనుగుతావుల వరి అన్నం,
మిరియపు పొడితోపాటు
చుయ్యిమనే తిరుగమోత చప్పుడు
చల్లారని శాకాలు, ముక్కుజబ్బును
మాన్పగలిగే ఆవపిండితో కూరిన
పచ్చళ్ళు, ఊరగాయలు, చేయి
చురుక్కుమనే నేయి, సగమిగురకాచిన
పాలు చలికాలంలోని ఆహారపదార్థాలుగా
వడ్డించేవాడు విష్ణుచిత్తుడు - అని భావం.

No comments:

Post a Comment