Saturday, November 12, 2016

తదాస్య మారుత సుగంధాకృష్టమై


తదాస్య మారుత సుగంధాకృష్టమై



సాహితీమిత్రులారా!



శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలోని
పాంచజన్య స్తుతి చూడండి-

హరి పూరింపఁ దదాస్య మారుత సుగంధాకృష్టమై నాభిపం
కరుహక్రోడమిళిందబృంద మెదు రెక్కం దుష్క్రియాపంక సం
కర దైత్యాను పరంపరం గముచు రేఖం బొల్చు రాకా నిశా
కరగౌరద్యుతి పాంచజన్య మొసఁగుం గళ్యాణ సాకల్యమున్


విష్ణువు తన శంఖాన్ని పూరిస్తుంటే 
ఆ స్వామి ముఖవాయువులందున్న
పరిమళాలవల్ల ఆయన నాభిపద్మంలో 
ఉన్న తుమ్మెదలబారు ఎదురెక్కుతున్నది. 
అది ఎలా ఉందంటే శంఖధ్వని పాపపంకిలమైన 
రాక్షసుల ప్రాణసమూహాన్ని త్రాగుతున్నట్లుగా ఉన్నది. 
పున్నమినాటి చంద్రునివలె తెల్లగా ఉన్న ఆ పాంచజన్యం 
సకల కల్యాణములను ప్రసాదించు గాక! - అని భావం.

No comments:

Post a Comment