Tuesday, November 1, 2016

కవిత్వ విమర్శ అంటే?


కవిత్వ విమర్శ అంటే?



సాహితీమిత్రులారా!


బైచరాజు వేంకటనాథుని
పంచతంత్రలోని
ఈ పద్యం చూడండి-

రస విస్ఫూర్తి గొరంత దీనికిది పూర్వ చ్ఛాయ యిచ్చోట ద
ప్పసదిప్పట్టున నర్థ పుష్టి పసలేదిచ్చోట నశ్లీలమ
ద్దెస నాదిక్కున దుస్సమాస మిది సందేహాస్పదం బీడనం
చుసుమాళంబున బాండి తుల్నెరపు నీచు న్రోత వాక్రువ్వగన్


కవిత్వంపై విమర్శ చేయడంవలన
దానికి విలువ పెరుగుతుంది.
విమర్శ అంటే దానిలోని గుణదోషాల
వివేచనమాత్రమే కాని కొందరు
కవిత్వంలోని తప్పులను ఎంచడమే
పనిగా పెట్టుకుంటారు వారిని
దోషైకదృక్కులు అంటారు.
అలాంటి వారిని గురించి చెప్పే పద్యం ఇది.

దీనిలో రసం అంతగా ప్రకాశించలేదు.
ఇది పూర్వకవుల రచనకు నకలుగాఉంది.
ఇక్కడ దోషం ఉంది. ఇది అందంగాలేదు.
దీనిలో అర్థం సరిగాలేదు. దీనిలో అశ్లీలత ఉంది.
 అక్కడ దుష్టసమాసం వేయబడింది.
ఈ విషయం సందేహం కలిగేదిగా ఉంది అంటూ
వీరావేశంతో  తప్పులనుపడుతూ,
తమ పాండిత్యాన్ని ప్రదర్శించే నీచులను
గురించి చెప్పాలంటేనే అసహ్యం కలుగుతుందని తీవ్రంగా
నిరసించినాడు ఈ కవి.

అంటే తప్పులను చూడవద్దనికాదు
కేవలం తప్పులనే చూడవద్దని కవి భావన

No comments:

Post a Comment